అక్షరటుడే, ఇందూరు: Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad RTC) నుండి వరంగల్కు డీలక్స్ బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.
Nizamabad Warangal Buses | 50 ట్రిప్పులు
నిజామాబాద్ నుంచి వరంగల్కు.. వరంగల్(Warangal Route) నుంచి నిజామాబాద్కు మొత్తంగా 50 డీలక్స్ ట్రిప్పులను ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ బస్సులు ఉదయం 3.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయని వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ ప్రత్యేక షెడ్యూల్ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి: Moscow Drone Attack| రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడి.. ఒక భారతీయుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు


