Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. నిజామాబాద్ – వరంగల్ మధ్య డీలక్స్ బస్సులు ప్రారంభం

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ (TGSRTC) ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad RTC) నుండి వరంగల్​కు డీలక్స్​ బస్సులు నడపనున్నట్లు ఆర్​ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

Nizamabad Warangal Buses | 50 ట్రిప్పులు

నిజామాబాద్​ నుంచి వరంగల్​కు.. వరంగల్​(Warangal Route) నుంచి నిజామాబాద్​కు మొత్తంగా 50 డీలక్స్​ ట్రిప్పులను ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ బస్సులు ఉదయం 3.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయని వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ ప్రత్యేక షెడ్యూల్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: Moscow Drone Attack| రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడి.. ఒక భారతీయుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *