Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి!

పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panduga Sayanna | ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ (Mudiraj) సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి వినతి పత్రం సమర్పించారు.

పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Panduga Sayanna | సానుకూలంగా స్పందించిన సీఎం

ముదిరాజ్ సంఘం నాయకుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పండుగ సాయన్న జయంతి అధికారిక నిర్వహణతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ-ఏ కేటగిరీకి మార్పు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. కొత్తగా ఏడు అమృత్​ భారత్​ రైళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *