అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PDSU Leaders Arrest | జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శనివారం పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
PDSU Leaders Arrest | పీడీఎస్యూ నాయకులను..
మంత్రి పర్యటనను విద్యార్థి సంఘాలు అడ్డుకునే అవకాశాలున్నాయని పేర్కొంటూ పోలీసులు పలువురు నాయకులను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్యూ (PDSU) జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పరిష్కరించకుండా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Ganja Seizure | సాయి షిర్డీ ఎక్స్ప్రెస్లో 24.3 కిలోల గంజాయి పట్టివేత