అక్షరటుడే, కామారెడ్డి: Rahul Revanth BC Justice | అగ్ర కులాలకు చెందిన వారైనా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డిలు బీసీలకు న్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ రావు మాట్లాడుతూ.. దేశానికి మూడు సార్లు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, ఆయన బీసీ అయి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు.
Rahul Revanth BC Justice | బీసీల గురించి ఆలోచించే నేతలు

అగ్ర కులానికి చెందిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీల గురించి ఆలోచిస్తున్నారని వీహెచ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలు ఎక్కువగా ఉన్నారని, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని గమనించారని చెప్పారు. అందుకే బీసీల లెక్క తేల్చాలని నిర్ణయించారని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పట్టుబట్టారని వివరించారు.
Rahul Revanth BC Justice | అందుకే జనగణన నిర్ణయం

జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరగాలని కోరడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) జనగణన చేపట్టడానికి నిర్ణయించిందని హన్మంత్ రావు పేర్కొన్నారు. అయితే జనగణనలో కులగణన వద్దని మెలిక పెట్టిందని ఆరోపించారు. కులగణన చేపడితే బీసీల లెక్క తేలుతుందని, ఈ విషయమై కోర్టుకు వెళ్తే కులగణన చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ (Telangana)లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కులగణన చేయాలని నిర్ణయించి రూ.150 కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందాక ఫైల్ను గవర్నర్కు పంపారని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Advocates Protection Act | అమలులోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం


