Rajesh Exports KTR | ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ సెబీ సెన్సేషన్.. తెలంగాణ రాజకీయాల్లో ‘గోల్డ్ స్కామ్’ మంటలు.. కేటీఆరే టార్గెట్‌గా విపక్షాల దాడి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajesh Exports KTR | దేశీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తున్న ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ (Rajesh Exports) ఉదంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపాను సృష్టిస్తోంది.

గత భారాస ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒక ప్రతిష్ఠాత్మక ఒప్పందాన్ని అస్త్రంగా చేసుకుని, అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) పై ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగాయి.

₹15.15 లక్షల కోట్ల భారీ ఆర్థిక అవకతవకలపై మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు (Interim Order) ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ హీట్​ను పెంచుతున్నాయి.

Rajesh Exports KTR | నాడు ‘హిస్టారికల్ డే’.. నేడు పొలిటికల్ వార్!

జూన్ 12, 2022న తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సమక్షంలో ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ అనుబంధ సంస్థ ‘Elest’ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

₹24,000 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే మొట్టమొదటి ‘AMOLED డిస్‌ప్లే ఫ్యాబ్’ (స్మార్ట్‌ఫోన్లు, టీవీ స్క్రీన్ల తయారీ ప్లాంట్) ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు నాడు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా “Historic day for Telangana” అంటూ ఉత్సాహంగా ట్వీట్ కూడా చేశారు.

అయితే, తాజాగా సెబీ జరిపిన విచారణలో ఈ కంపెనీ చూపించిన సుమారు 99.8% ఆదాయం బోగస్ అని, విదేశీ సబ్సిడీల ద్వారా దాదాపు ₹15.15 లక్షల కోట్ల మేర ఆర్థిక అకౌంటింగ్ మాయాజాలానికి (Misrepresentation) పాల్పడిందని ప్రాథమికంగా తేలడంతో సీన్ రివర్స్ అయింది.

నాడు కేటీఆర్ చేసిన హడావుడిని, ప్రకటనలను నమ్మి వేలాది మంది సామాన్య ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లు కొని ఇప్పుడు నిలువునా మోసపోయారంటూ సోషల్ మీడియాలో ‘ఆపన్నహస్తం’ వంటి హ్యాండిల్స్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Rajesh Exports KTR | “వాటా ఎంత?”.. విపక్షాల ప్రశ్నల వర్షం

ఈ స్కామ్ బయటపడటంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. “కేటీఆర్ తెలంగాణకు తెచ్చిన ఘనమైన కంపెనీ ఇదా? ఈ స్కామ్‌లో మీ వాటా ఎంత? మీకు ముట్టిన కమీషన్ ఎంత?” అంటూ ఘాటుగా పొలిటికల్ పోస్టులు పెడుతున్నారు. తప్పుడు రికార్డులు ఉన్న కంపెనీలను వెనకేసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారనేది విపక్షాల ప్రధాన ఆరోపణ.

akshara today .jpgktr

Rajesh Exports KTR | నిజంగానే కేటీఆర్‌కు సంబంధం ఉందా?

రాజకీయంగా ఈ అంశంపై ఎంత రచ్చ జరుగుతున్నప్పటికీ, సెబీ విడుదల చేసిన 109 పేజీల నివేదికలో ఎక్కడా కేటీఆర్ పేరు గానీ, తెలంగాణ సర్కారు ప్రమేయం గానీ లేకపోవడం గమనార్హం.

కంపెనీ అంతర్గత మోసం: రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోటర్ రాజేశ్ మెహతా తన వ్యక్తిగత ట్రేడింగ్ అకౌంట్ల కోసం, కంపెనీ టర్నోవర్‌ను ఎక్కువగా చూపించుకోవడం కోసం సొంతంగా చేసుకున్న అకౌంటింగ్ జిమ్మిక్కులే ఇవని సెబీ పేర్కొంది.

ప్రభుత్వాల పరిమితులు: పెట్టుబడులు పెడతామని ఏ పెద్ద కంపెనీ వచ్చినా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా (అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా) ఉపాధి అవకాశాల కోసం ఎంఓయూ (MoU) కుదుర్చుకుంటుంది.

ఆ కంపెనీ లోపల జరిగే ఆర్థిక మోసాలను కనిపెట్టే వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండవు, అది పూర్తిగా సెబీ, ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థల పరిధిలోని అంశం.

akshara today .jpgrajesh s

Rajesh Exports KTR | కంపెనీ ఖండన

ఈ ఆరోపణలను రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వల్ల జరిగిందని, తాము ఎలాంటి మోసానికి పాల్పడలేదని, సెబీకి తగిన ఆధారాలు సమర్పిస్తామని స్పష్టం చేసింది.

కాగా, రాబోయే రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. సెబీ తుది నివేదిక వచ్చే వరకు ఈ ‘గోల్డ్ స్కామ్’ చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *