అక్షరటుడే వెబ్డెస్క్:RBI Repo Rate | దేశంలోని రుణగ్రహీతలకు , ఆర్థిక రంగానికి ఉపశమనం కలిగిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని కాపాడటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే ఉద్దేశంతో.. కీలక వడ్డీ రేట్లను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం తెలిపారు.
RBI Repo Rate | ఎలాంటి మార్పు లేకుండా..
ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 6.9 శాతం నుండి 6.6 శాతానికి సవరించింది.

RBI Repo Rate | లోన్ ఈఎంఐలు స్థిరంగా..
వడ్డీ రేట్లను మార్చకుండా ఆర్బీఐ పాత రేట్లనే కొనసాగించడం ఇది వరుసగా 20వ సారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక ఒడిదుడుకులు, దేశీయంగా ఆహార వస్తువుల ధరల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. రేట్ల తగ్గింపుపై ఎలాంటి తొందరపాటు వద్దని భావించింది.

RBI Repo Rate |సామాన్యుడికి లాభం..
ఆర్బీఐ నిర్ణయంతో ఇళ్లు, కార్లు, వ్యక్తిగత రుణాలు (Personal Loans) తీసుకున్న వారిపై కొత్తగా అదనపు ఈఎంఐ (EMI) భారం పడదు. ప్రస్తుతమున్న వడ్డీ రేట్లే యథాతథంగా కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి: Deputy Collectors Transfers | పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
