అక్షరటుడే, వెబ్డెస్క్: Revanth Reddy Visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
Revanth Reddy Visit | రూ.230 కోట్ల వ్యయంతో
కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేయనున్నారు. దాదాపు రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయానికి మరింత వన్నె తెచ్చేలా, ఇక్కడి ప్రాంతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా ఉండనున్నట్లు చెబుతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

