Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Flat | హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా.. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic stock market) పైనా కనిపించింది.

బుధవారం ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 625 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 191 పాయింట్లు ఎగబాకింది. మధ్యాహ్నం వరకు స్వల్ప ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు.. ఆ తర్వాత ఒక్కసారిగా సెల్లాఫ్‌కు గురయ్యాయి. దీంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 73,983 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Flat | ఎఫ్ఎంసీజీ మినహా..

Stock Market Flat

ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.05 శాతం పెరిగింది. మిగిలిన అన్ని ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. మీడియా 2.36 శాతం, టెలికాం 1.98 శాతం, రియాలిటీ 1.74 శాతం, ఎనర్జీ 1.71 శాతం, మెటల్ 1.70 శాతం, పవర్ 1.64 శాతం, యుటిలిటీ 1.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.48 శాతం నష్టపోయాయి.

Stock Market Flat | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 1,472 కంపెనీలు లాభపడగా 2,748 స్టాక్స్ నష్టపోయాయి. 149 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 115 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 77 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్ లాభపడగా.. 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 1.70 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.70 శాతం, కొటక్ బ్యాంక్ 1.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.40 శాతం, ఐటీసీ 1.30 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 2.46 శాతం, టాటా స్టీల్ 1.99 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.67 శాతం టైటాన్ 1.48 శాతం, ఎంఅండ్ ఎం 1.32 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *