అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Formation Day | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Telangana Formation Day | అమరవీరుల త్యాగాలు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, తెలంగాణ ఉద్యమ చరిత్రలో వారి పాత్రను గుర్తుచేసుకున్నారు.
Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై “మహా” నిర్లక్ష్యం..


