అక్షరటుడే, అమరావతి: Telugu Desam Party | తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. దేశంలోనే బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన కొనియాడారు.
Telugu Desam Party | వార్తలోని అంశాలు:
సగర్వంగా ఎగిరే జెండా: “చాలా పార్టీలు ఒక్క ఓటమితోనే అంతర్థానమైపోతున్నాయి. కానీ, గెలిచినా.. ఓడినా సగర్వంగా ఎగిరేది ఒక్క పసుపు జెండా మాత్రమే” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 44 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొన్నా పార్టీ పౌరుషం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు.
కార్యకర్తే అధినేత: సీనియారిటీ, సిన్సియారిటీని ప్రాతిపదికగా తీసుకుని సుమారు 250 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి పొలిట్బ్యూరో సభ్యుల వరకు పదవులు కల్పించడం ద్వారా ‘కార్యకర్తే అధినేత’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని పేర్కొన్నారు.
లక్ష్యం 2029: 2024 ఎన్నికల్లో వచ్చిన అద్భుత విజయంపై సంతృప్తి చెందకుండా, వచ్చే ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ఓట్ల శాతం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి..: Visakha Express Assault | విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం.. మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం


[…] […]