అక్షరటుడే, భీమ్గల్ : Tractor Trolley Accident | రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొన్న (Road Accident) ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భీమ్గల్ (Bheemgal) దేవక్కపేట వద్ద బుధవారం చోటు చేసుకుంది.
Tractor Trolley Accident | దేవక్కపేటలో..
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గుగులోత్ ప్రమోద్ తన బంధువైన గుగులోతు నరేందర్తో కలిసి దేవక్కపేటలోని చుట్టాల ఇంటికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన క్రమంలో దేవక్కపేట గ్రామ శివారులో రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ప్రమోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన నరేందర్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ట్రాలీని రోడ్డుపై నిలిపిన గంధం రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమ్గల్ ఎస్సై తిరుపతి తెలిపారు. రాత్రి వేళల్లో రోడ్లపై వాహనాలు నిలిపితే తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: CJP Movement | సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదు: అభిజీత్ దీప్కే