Visakhapatnam Accident | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు.. లారీని ఢీకొనడంతో ఈ విషాద ఘటన సంభవించింది.
Visakhapatnam Accident | మృతుల్లో బాలుడు..
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.