అక్షరటుడే, వెబ్డెస్క్: Wayanad Landslide | కేరళ (Kerala)లోని వయనాడ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో మంగళవారం వయనాడ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నారనే సమాచారంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే అనక్కొంపోయిల్-మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని కల్లాడి వద్ద ఉన్న మీనాక్షి వంతెన దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ నిర్మాణ కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Wayanad Landslide | 265మి.మీ. వర్షపాతం
వయనాడ్లో 24 గంటల్లో 265 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు. ఈ ఘటనలో టన్నెల్ ప్రాజెక్ట్ కార్మికులను తరలించేందుకు ఉపయోగించే కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సమీపంలో కొన్ని ఇళ్లు, హోమ్స్టేలు ఉన్నప్పటికీ వాటికి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.
Wayanad Landslide | సీఎం అత్యవసర సమావేశం

వయనాడ్ కొండచరియల ఘటన నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్తో అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి అనిల్ కుమార్, వయనాడ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సిద్ధిక్లను వెంటనే జిల్లాకు వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలన్నారు.
A major landslide occurred at the face of the Kozhikode-Wayanad twin-tunnel road today , several feared trapped pic.twitter.com/Wnoz3Nv5lK
— Umarul Farooque (@Ufarooque) July 7, 2026
ఇది కూడా చదవండి..: Ahmedabad Blasts Verdict | అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష