అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR Jagtial Meeting | జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి (Jeevan Reddy) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ బాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు.
రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అడ్డం పొడువు మాట్లాడుతారన్నారు. కానీ ప్రజలకు నీరు ఇవ్వడం లేదని విమర్శించారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారన్నారని పేర్కొన్నారు. ‘నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన నేను చావ కొడక’ అన్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగొద్దని.. ఈ వెదవల శాపానికి కేసీఆర్ చస్తాడా అన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాని విమర్శించారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
KCR Jagtial Meeting | భూముల ధరలు పడిపోయాయి
బీఆర్ఎస్ (BRS) హయాంలో భూముల ధరల భారీగా ఉండేవని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు భూములు కొనేవారు కరువయ్యారన్నారు. ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బోనస్ పేరిట బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
KCR Jagtial Meeting | 40 ఏళ్లుగా స్నేహితులం
జీవన్రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని కేసీఆర్ అన్నారు. ఆయన తన సైన్యాన్ని తీసుకొని తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. ఆయన వెంట వచ్చిన వారికి కేసీఆర్ స్వాగతం తెలిపారు. జీవన్రెడ్డి తాను 40 ఏళ్లుగా స్నేహితులమన్నారు. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జీవన్రెడ్డి అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన తన ప్రాంత అభివృద్ధిని ఏనాడు విస్మరించలేదన్నారు. జీవన్రెడ్డి చేరికతో చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందన్నారు.

KCR Jagtial Meeting | పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం
తాను జీవన్రెడ్డి కుటుంబంలో అన్నాదమ్ముళ్ల తాము పని చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన చేరికతో బీఆర్ఎస్కు బలం వచ్చిందన్నారు. జీవన్రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బాధ్యతలు కూడా ఆయన చూడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జీవన్రెడ్డికి మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
KCR Jagtial Meeting | రైతుబంధుకు ఎగనామం
తాము తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని కేసీఆర్ చెప్పారు. ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు తనకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. తమ హయాంలో మిషన్ కాకతీయ పేరిట చెరువులను పునరుద్ధరించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు (Rythu Bhandu)కు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ చెప్పారన్నారు. తమ హయాంలో 10 రోజుల వ్యవధిలో అందరు రైతులకు రైతు బంధు వేశామన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు నెలకు ఒక ఒకరకు మాత్రమే వేస్తున్నారని విమర్శించారు.

యూరియా ఇవ్వలేని ప్రభుత్వం
ఈ ప్రభుత్వానికి యూరియా (Urea) బస్తాలు ఇవ్వడం చేతకావడం లేదని కేసీఆర్ విమర్శించారు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్ల్లో ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు అనేక గోసలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతగాని తనానికి ఇది నిదర్శనమన్నారు.
హైడ్రాను రద్దు చేస్తాం
హైదరాబాద్లో పనికిమాలిన హైడ్రా (Hydraa)ను తెచ్చి పేదల ఇళ్లు కూల్చుస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తమ హయాంలో 3.50 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చమన్నారు. బీఆర్ఎస్ రాగానే హైడ్రాను ఎత్తి బయట పడేస్తామన్నారు. మొదటి సంతకంతో హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఎన్నో చెరువులు బాగు చేశామని.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నిలదీస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా బస్తాలు ఇవ్వడానికి చేతనైతలేదా?
యూరియా కావాలంటే.. యాప్ లో బుక్ చేసుకోండి అంటున్నరు. దుకాణాల్లో లేని యూరియా యాప్ లో ఉంటదా?
యూరియా బస్తా కోసం రైతులు ఇంత గోస పడాల్నా?
ఇది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం.– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/npkg9VVREy
— BRS Party (@BRSparty) April 20, 2026
దీనిని కూడా చదవండి : Harish Rao Delhi Visit | హరీశ్రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

