Paddy Transport | కలెక్టర్​ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న అధికారులు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Transport | ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. జిల్లా పౌర సరఫరాల అధికారులు గురువారం డొంకేశ్వర్​ సొసైటీ పరిధిలోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

Paddy Transport | మిగిలిపోయిన ధాన్యంపై ఆరా..

జిల్లా పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సీఎస్‌సీ ప్రవీణ్, ఏసీఎస్​వో కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కుడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPCs) పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడంపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ట్యాబ్ ఎంట్రీలను (Tab Entry) సకాలంలో పూర్తి చేయడంతో పాటు ఈనెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.

అలాగే బ్యాక్‌వాటర్‌లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమా పారా బాయిల్డ్ రైస్​మిల్లును సందర్శించి, మిల్లుకు చేరుతున్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ అంగీకార ప్రక్రియ (Miller Acknowledgement)ను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యానికి సూచించారు.

paddy 2

ఇది కూడా చదవండి: Siddaramaiah Resignation | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా .. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *