Nizamabad Police | నగరంలో దారుణం.. రెండున్నర నెలల బాలుడిని హత్య చేసిన తండ్రి..

కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో దారుణంగా హత్య చేశాడు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police | కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని (nizamabad) రైల్వే ట్రాక్​(Railway Track) సమీపంలో నిర్దయగా హత్య చేశాడు. ఈ అమానుష ఘటన నగరంలో కలకలం రేపింది.

Nizamabad Police | మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో..

నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన యువరాజ్​ దంపతులకు రెండున్నర నెలల బాబు ఉన్నాడు. కానీ ఈ బాబు తనకు పుట్టలేదని అనుమానంతో అతడు నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నగరంలోని రైల్వే ట్రాక్ పక్కకు బాబును తీసుకొచ్చి కత్తితో నరికి హత్య చేశాడు. రైల్వే ట్రాక్ పక్కన బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్​హెచ్​వో రఘుపతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

railway 1

ఇది కూడా చదవండి : NEET Re Exam | నీట్​ పరీక్షకు లైన్​ క్లియర్​.. రీ-ఎగ్జామ్‌పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

 

Child Murder, Nizamabad Crime, Crime News, Railway Track Incident, Police Investigation, Telangana News, Family Tragedy, Breaking News

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *