Shamshabad Bolero Accident | శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరు మహిళల మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad Bolero Accident | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్​లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Shamshabad Bolero Accident | స్కిడ్​ కావడంతో

శంషాబాద్ సత్తంరాయి వద్ద బస్టాండ్​లో ఎదురు చూస్తున్న మహిళలపైకి మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం గురువారం ఉదయం దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​ టేక్​ చేయడానికి యత్నించగా.. వాహనం స్కిడ్​ కావడంతో మహిళలను ఢీకొంది. దీంతో వాహనం కింద పడి సుమ, సువర్ణ అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్​ జామ్​ కాగా.. క్లియర్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు భారీ వర్షాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *