అక్షరటుడే, ఎల్లారెడ్డి: Banswada Municipality | హామీలు ఇచ్చి మరిచిపోయే ఈ రోజుల్లో.. హామీలకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో(Yellareddy Municipality) 8వ వార్డు నుంచి స్వతంత్ర కౌన్సిలర్గా గెలిచిన ఆయన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.
Banswada Municipality | ఎల్లారెడ్డి పట్టణంలో..
రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) సిద్ధి శ్రీధర్ గుప్తా ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం సొంత నిధులతో బోరుబావి తవ్వించారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సొంత మ్యానిఫెస్టో ప్రకటించి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సిద్ది శ్రీధర్ గుప్తా భారీ మెజారిటీతో విజయం సాధించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గుప్త చేతిలో పరాజయం పాలయ్యారు. ఆడపిల్ల పెళ్లికి రూ.11వేలు ఇస్తానన్న హామీని నెరవేరుస్తూ.. వార్డుకు చెందిన ఇద్దరు పెళ్లి కూతుళ్లకు రూ.22వేలు అందించారు. అలాగే ఆడబిడ్డ పుడితే రూ.10వేలు ఇస్తానని ప్రకటించి ఆ హామీని సైతం నెరవేర్చారు.
ఫ్రీజర్(Freezer) సైతం వార్డ్లో ఏర్పాటు చేశారు. తన వార్డులోని ఉప్పర్ గల్లీలో నీటి ఎద్దడి తీర్చేందుకు సొంత నిధులతో బోరుబావి తవ్విస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉప్పర్గల్లీ వాసులకు రూ.వేలల్లో ఖర్చు చేసి బోరుబావి తవ్వించడంపై గల్లీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంతమందికే సాధ్యమని, అందులో సిద్ధి శ్రీధర్ గుప్తా వంటి వారు అరుదు అని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RTC JAC talks | ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల చర్చ.. డిమాండ్లపై సానుకూలం!

