అక్షరటుడే, ఇందూరు: Nizamabad General Hospital | నగరంలోని (Nizamabad) ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని..వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశం బుధవారం నిర్వహించారు.
Nizamabad General Hospital | అధికారులు.. సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ప్రతి విభాగం అధికారులు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రధానంగా వైద్యులు హాజరు విషయంలో రాజీ పడేది లేదని, ప్రతిఒక్కరూ నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఆస్పత్రిలో సివిల్ వర్క్ సమస్యలు అనేకంగా నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. చాలా సమయాల్లో ల్యాబ్, ఎక్స్రే తదితర వాటికోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొందరు కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి విభాగాధిపతి సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలన్నారు.
Nizamabad General Hospital | రోగులకు ఉత్తమ సేవలందించాలి..
అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ రోగులకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలని అర్బన్ ఎమ్మెల్యే సూచించారు. వచ్చే సమావేశానికల్లా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రధానంగా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, మేయర్ కూరగాయల ఉమారాణి, డిఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జీల నియామకం