అక్షరటుడే, కామారెడ్డి : Tractor Accident | ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. సదాశివనగర్ (Sadashivanagar) మండలం యాచారం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Tractor Accident | బంధువుల ఇంటికి వెళ్లి..
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి(Indalwai) మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ కుమారుడు లక్ష్మణ్ (9) స్థానిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. కాగా సదాశివనగర్ మండలంలోని యాచారం గ్రామంలో బంధువుల ఇంటి వద్ద దశదిన ఖర్మ కార్యక్రమానికి వచ్చారు. గ్రామంలో బాలుడు బయట ఆడుకుంటుండగా ఓ ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునే సరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన NIMS..