అక్షరటుడే, వెబ్డెస్క్: PDS Rice Seized | నిజామాబాద్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి.
రెండు కేసుల్లో మొత్తం 51 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఐదో ఠాణా ఎస్ఐ డి. సునీల్ తెలిపారు.
PDS Rice Seized | అక్రమంగా నిల్వ ఉంచిన…
పోలీసుల వివరాల ప్రకారం, మొదటి ఘటనలో అస్మి కాలనీ, నాగారం ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 19.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో షేక్ సోహైల్, నోమన్, సిద్ధిక్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Nizamabad Chain Snatching | చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు..నిందితుల అరెస్టు
PDS Rice Seized | అక్రమంగా తరలిస్తుండగా..
మరో ఘటనలో నాగారం ప్రాంతంలోని 80 క్వార్టర్స్ వద్ద 31.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అబ్దుల్ అర్బాజ్, అబూ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు, నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.