Marriage Fraud | యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ..

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Marriage Fraud | పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు ఎడపల్లి (Yedapally) మండలం దుబ్బ తండాలో యువకుడి ఇంటి ఎదుట శనివారం ధర్నాకు (Protest) దిగింది.

Marriage Fraud | దుబ్బ తండాలో..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం దుబ్బతండాకు (Dubba thanda) చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భవతి కాగా.. పెళ్లిచేసుకోవాలని కోరగా తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో విసుగు చెందిన సదరు యువతి శనివారం దుబ్బ తండాలోని యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సైతం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సదరు యువకుడిపై పోలీసు కేసు (Yedapally police) నమోదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

3 1

12 5

ఇది కూడా చదవండి: Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *