అక్షరటుడే, బోధన్: Marriage Fraud | పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు ఎడపల్లి (Yedapally) మండలం దుబ్బ తండాలో యువకుడి ఇంటి ఎదుట శనివారం ధర్నాకు (Protest) దిగింది.
Marriage Fraud | దుబ్బ తండాలో..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం దుబ్బతండాకు (Dubba thanda) చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భవతి కాగా.. పెళ్లిచేసుకోవాలని కోరగా తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో విసుగు చెందిన సదరు యువతి శనివారం దుబ్బ తండాలోని యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సైతం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సదరు యువకుడిపై పోలీసు కేసు (Yedapally police) నమోదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.


ఇది కూడా చదవండి: Travel Bus Fire | ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం


