అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchajanya Sabha | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నిజామాబాద్లో సభ నిర్వహించనున్నారు. ఆగస్టు 26న పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు సభ ఉంటుంది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. సభ పర్యవేక్షకులుగా టీఆర్ఎస్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ డాక్టర్ రఘును కవిత నియమించారు. కాగా కొత్త పార్టీ పెట్టిన అనంతరం కవిత జిల్లాలో మొదటి సభ పెడుతుండటం గమనార్హం.
Panchajanya Sabha | పార్టీ బలోపేతం కోసం..
ఇటీవల కొత్త పార్టీ పెట్టిన కవిత దాని బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సింగరేణిలో రెండు విడతలుగా బాయిబాట పేరిట పర్యటించారు. పలు జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఆందోళనలు చేశారు. తొలిసారి నిజామాబాద్లో సభ పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆమె గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేసిన విషయం తెలిసిందే. దీంతో పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Jharkhand Student Protest | జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ తప్పు : రాహుల్ గాంధీ