Excise Employee | అనుమానాస్పద స్థితిలో ఎక్సైజ్ ఉద్యోగి మృతి

ఎక్సైజ్​ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Excise Employee | ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఈ ఘటన చోటు చేసుకుంది.

Excise Employee | కల్కినగర్​లో..

పట్టణంలోని కల్కినగర్​లో నివాసం ఉంటున్న మామిడి అనిల్ కుమార్(41) ఎక్సైజ్​ శాఖలో (Excise Department) జూనియర్​ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన తన ఇంట్లో శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అతడిని 108 అంబులెన్సులో జీజీహెచ్​కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అనిల్ కుమార్ మృతిపై ఆయన తల్లి ఇందిర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్‌కు భార్య నీరజ, పిల్లలు శాన్వి, జాహ్నవి, రిషిత్ ఉన్నారు. తల్లి ఇందిర ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురికి తరలించారు. కాగా అనిల్​ దోమకొండ ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేసేవాడు.

ఇది కూడా చదవండి: Telangana Weather | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *