అక్షరటుడే, వెబ్డెస్క్ : SSC Results | తెలంగాణ (Telangana)లో పదో తరగతి ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ (Education Department) అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మార్చి 14న ప్రారంభమైన ఎగ్జామ్స్ ఏప్రిల్ 13న ముగిశాయి. మొత్తం 5.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు అయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం గతంలోనే ముగిసింది. ఈ క్రమంలో బుధవారం ఫలితాలు విడుదల కోసం పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు.
SSC Results | విద్యార్థుల్లో ఉత్కంఠ
ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసింది. మార్కుల వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయడం ఇటీవల పూర్తయింది. దీంతో బుధవారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలు విడుదల చేస్తారు. పదో తరగతి అనంతరం విద్యార్థులు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులను ఎంచుకుంటారు. ఈ క్రమంలో తమకు ఎన్ని మార్కులు వస్తాయి, ఏ కోర్సు తీసుకోవాలని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు సైతం మంచి ఇంటర్ కాలేజీలో చేర్పించడానికి సిద్ధం అవుతున్నారు.
ఇది కూడా చదవండి..: MPTC ZPTC Elections | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మరింత ఆలస్యం

