అక్షరటుడే, వెబ్డెస్క్: CCTV Hacking Allegations | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఇళ్లు, కార్యాలయాల వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జైలు (Sangareddy Jail)లో మన్నె క్రిశాంక్ను హరీశ్రావు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు (IPS Officers) తమ ఫోన్లు, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.
CCTV Hacking Allegations | నిఘా పెడుతున్నారు
బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంలో వాళ్లను పెట్టి బీఆర్ఎస్ నాయకులు మీద నిఘా పెడుతున్నారని హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడుతామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారులు రిటైరైనా వదిలి పెట్టమని హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డి కాదు కదా ఎవ్వరూ వారిని కాపాడలేరన్నారు.
CCTV Hacking Allegations | ఫేక్ పోస్టులు పెట్టి…
మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు వాళ్ల మీద కేసు పెట్టకుండా.. క్రిశాంక్ మీద కేసు పెట్టారని హరీశ్రావు అన్నారు. దొంగతనం చేసిన వాడిని వదిలేసి.. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాడిని లోపల పెట్టినట్లు ఉందని విమర్శించారు. క్రిశాంక్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని, ఫోన్ తీసుకుపోయి పోలీసులకు ఇస్తే ఎవరైనా నాన్ బెయిలబుల్ కేసు పెడతారా అని కోర్టు కూడా అడిగి, దాన్ని కొట్టేసిందన్నారు.
ఇది కూడా చదవండి..: SSC Results | రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు


[…] ఇది కూడా చదవండి..: CCTV Hacking Allegations | మా సీసీ కెమెరాలు హ్యాక్ చే… […]