అక్షరటుడే, వెబ్డెస్క్: LPG Price Hike | దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 993 పెంచినట్లు సమాచారం. దీంతో దేశ రాజధాని Delhiలో ఒక్క సిలిండర్ ధర రూ. 3,071.50కి చేరింది. పెంచిన ధర నేటి నుంచే అమల్లోకి రానుంది.
అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులపై అదనపు భారం పడలేదు.
LPG Price Hike | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు యథాతథం
ఇదిలా ఉండగా విమానయాన రంగానికి సంబంధించిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయ విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలను పెంచకుండా భరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని IndianOil వెల్లడించింది.
ఈ పరిణామాలతో వాణిజ్య రంగంపై ప్రభావం ఉండే అవకాశం ఉండగా, గృహ వినియోగదారులకు మాత్రం కొంత ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

