అక్షరటుడే, బాన్సువాడ: Son Attack Father | తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన చిన్న వివాదంలో ఘర్షణ ఏర్పడింది. ఇది చివరకు హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటన మోస్రా (Mosra) మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకోగా స్థానికంగా కలకలం రేపింది.
Son Attack Father | మోస్రా మండలంలో..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా మండలానికి చెందిన ముస్తఫా (తండ్రి), అతని కుమారుడు అమాన్ మధ్య కొంతకాలంగా కుటుంబ సంబంధిత విషయాలపై విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ముస్తఫాకు భార్యతో గొడవ జరిగింది. తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొడుకు అమాన్ అడ్డువచ్చాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తుడైన అమాన్.. ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ముస్తఫాకు తీవ్రమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, పొరుగువారు గాయపడిన ముస్తఫాను నిజామాబాద్లోని (Nizamabad) ఓ ఆస్పత్రికి (Nizamabad) తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు (varni Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్పూర్లో కంటతడి పెట్టించే విషాదం


[…] […]