అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic staff health | ఎండాకాలంలో ట్రాఫిక్ సిబ్బంది(traffic police) ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో(CP Office) జనత ఫౌండేషన్(Janata Foundation) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆయన అందజేశారు.
Traffic staff health | ఎండాకాలంలో జాగ్రత్తలు అవసరం..
ఎండాకాలంలో ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. ఎండాకాలంలో సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూల్ వాటర్ ప్లాస్క్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్క్లు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎండల్లో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎల్లప్పుడూ తగినంత నీరు తాగుతూ ఉండాలని.. ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలన్నారు. జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, రిజర్వ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్, వాసవి జనత ఫౌండేషన్ సభ్యులు సాయి ప్రసాద్, మేటూరి లక్ష్మణ్ గుప్తా, గోలి ప్రసాద్, నితిన్ నంగనూరి, కల్యాణి మోటూరి, బచ్చు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్

