POLYCET Exam | పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం..‘నిమిషం’ నిబంధన అమలు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: POLYCET Exam | పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2026(polycet 2026) ప్రవేశ పరీక్షకు (entrance test) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిసెట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

POLYCET Exam | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని విజయ్​ కుమార్​ తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తం 2,643 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 11 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని తెలిపారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, బ్లూ బాల్ పాయింట్ పెన్, హెచ్​బీ పెన్సిల్, ఎరేజర్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ముందుగానే కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఇది కూడా చదవండి:Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *