అక్షరటుడే, వెబ్డెస్క్: Komiravelli Panchayat Bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా కనీసం భయపడటం లేదు. ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా ఏసీబీ Anti Corruption Bureau అధికారులు నిర్వహించిన అవినీతి నిరోధక దాడిలో కొమిరవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
Komiravelli Panchayat Bribery | ఇద్దరినీ రెడ్హ్యాండెడ్గా
కొమిరవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. రాజు గౌడ్ ఫిర్యాదుదారుడి స్థలంలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్లైన్ను తొలగించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ మొత్తాన్ని సర్పంచి భర్త గొల్లపల్లి ఆంజనేయులు ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Komiravelli Panchayat Bribery | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

