నిజామాబాద్Drug Abuse Awareness | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: సీపీ సాయిచైతన్య

Drug Abuse Awareness | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: సీపీ సాయిచైతన్య

మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్​ గ్రౌండ్​లో ఇటీవల డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drug Abuse Awareness | మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్​ గ్రౌండ్​లో (Police Parade Ground) ఇటీవల డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Drug Abuse Awareness | కుటుంబాలు చిన్నాభిన్నం..

మత్తు పదార్థాల వినియోగం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని సీపీ అన్నారు. ఆర్థికంగా సామాజికంగా వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరంగా మారుతుందని.. చట్టపరంగానూ తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీసు శాఖ (Nizamabad Police Commissionerate) కఠినచర్యలు తీసుకుంటుందని వివరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలన్నారు. మళ్లీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీయాక్ట్ లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Drug Abuse Awareness | నిరంతర నిఘా..

జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు రవాణా వినియోగపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీస్​బాస్​ సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ఎల్లప్పుడూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నా.. కొంటున్నట్లుగా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్​లో లేదా డయల్​ 100కు ఫోన్ చేయాలన్నారు.

పలువురికి డ్రగ్స్​ పరీక్షలు..

అనంతరం పరేడ్ గ్రౌండ్​కు వచ్చిన అనుమానితులకు డ్రగ్స్​ పరీక్షలు చేశారు. అందులో పాజిటివ్​గా తేలిన వారిని చట్టపరంగా కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అదనపు డీసీపీ (ఏఆర్) రాంచందర్​ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం.సోమనాథం, హోంగార్డ్ ఏసీపీ కె.దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ కె.శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్​రాజ్, సౌత్ రూరల్ సీఐ ఎన్ సురేష్ కుమార్, నార్త్ రూరల్ సీఐ బి .శ్రీనివాస్, డిచ్​పల్లి సీఐ కె.వినోద్, ధర్పల్లి సీఐ భిక్షపతి, నిజామాబాద్ డివిజన్ ఎస్​హెచ్​వోలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Care Degree College | అత్యుత్తమ బోధనకు చిరునామా ‘కేర్​ డిగ్రీ కళాశాల’: డైరెక్టర్​ నరాల సుధాకర్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Care Degree College | నగరంలో రెండు...

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి...

CBSE Three Language Rule | CBSC బోర్డు కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు కొత్త త్రీ-లాంగ్వేజ్ రూల్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు...

BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో...