అక్షరటుడే, డిచ్పల్లి: Tank Repair Works | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చెరువులు, చెక్డ్యాంల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. ఆ మేరకు ఎమ్మెల్యే తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశంమయ్యారు.
Tank Repair Works | వర్షాకాలం లోపు..
ముత్యాల చెరువు గత వర్షాకాలంలో దెబ్బతినగా వెంటనే మరమ్మతులు చేయించాలని మండలంలోని వాడి, హొన్నాజీపేట గ్రామ రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతు పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అదేవిధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని చెక్డ్యాంల అంశంపై చర్చించారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)కి లేఖ రాశారు. కాగా.. నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్ర కుమార్, డీఈ ప్రేమ్ కుమార్, ఏఈలు సాయినాథ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన


