నిజామాబాద్Paddy Procurement | తుది దశకు చేరిన ధాన్యం సేకరణ ప్రక్రియ: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Paddy Procurement | తుది దశకు చేరిన ధాన్యం సేకరణ ప్రక్రియ: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​ జిల్లాలో యాసంగి 2026 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Procurement | జిల్లాలో యాసంగి 2026 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. మరో వారం రోజుల్లో సేకరణను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని ఆమె వెల్లడించారు.

Paddy Procurement | ఐకేపీ, పీఏసీఎస్​, మెప్మా ఆధ్వర్యంలో..

ప్రభుత్వం తరపున ధాన్యం సేకరణ కోసం ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఈసారి జిల్లాలో మొత్తం 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 6.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, సుమారు రూ.1,500 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, రైతుల ఖాతాల్లో రూ.1,320 కోట్లు జమా అయినట్లు వివరించారు. ధాన్యం సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే 430 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 40వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, మరో వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.

Paddy Procurement | వరికోతలు ఆలస్యమైనందున..

పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆలస్యంగా జరుగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తుండటంతో, అలాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. కాగా.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద రైతులు, హమాలీల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, తాగునీటి సదుపాయం, ఓఆర్ఎస్ సాచెట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొన్ని రైస్‌మిల్లుల వద్ద మధ్యాహ్న సమయంలో ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Paddy Procurement | సజావుగా సాగేందుకు కృషి..

ధాన్యం సేకరణ చివరి దశలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తూ, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండడంతో పాటు, ధాన్యం రవాణా కోసం తగినన్ని లారీలను సమకూర్చినట్లు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Online Medicine Sales | ఆన్​లైన్​లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...