అక్షరటుడే, వెబ్డెస్క్ : Bachupally Flyover | హైదరాబాద్ (Hyderabad) నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య సైతం పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా బాచుపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది.
Bachupally Flyover | రూ.147 కోట్లతో..
నాలుగు లేన్ల బాచుపల్లి ఫ్లై ఓవర్ను జూన్ 8న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. దీంతో మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్ మధ్య సిగ్నల్-ఫ్రీ రాకపోకలు సులభమై వేలాది మందికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 1.3 కిలో మీటర్ల ఈ ఫ్లై ఓవర్ను సుమారు రూ.147 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే మియాపూర్ – గండిమైసమ్మ, ప్రగతి నగర్ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గి, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది.
ఈనెల జూన్ 8న నాలుగు లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
దీంతో మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్ మధ్య సిగ్నల్-ఫ్రీ రాకపోకలు సులభమై వేలాది మందికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. pic.twitter.com/3TcxIOqajz
— Telangana First (@TelanganaFirst_) June 6, 2026
దీనిని కూడా చదవండి: Fine to Farmer | వరి కొయ్యలు కాల్చిన రైతుకు జరిమానా
