Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid festival) శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బోధన్ (Bodhan) పట్టణంలోని లయన్స్ క్లబ్​లో మైనార్టీ మత పెద్దలు, మసీద్​ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం (peace meeting) నిర్వహించారు.

Bakrid Peace Meeting | శాంతి భద్రతల పరిరక్షణపై..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్​లో లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు. జిల్లాలో శాంతిపూర్వక వాతావరణం కొనసాగేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని సీపీ పేర్కొన్నారు.

ముస్లిం మత పెద్దలు సైతం పట్టణంలో శాంతిసామరస్యాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, బోధన ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్​హెచ్​వో వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూరు సీఐ శ్రీకృష్ణ, బోధన్ ఎస్సైలు మనోజ్, చంద్రమోహన్, ట్రాఫిక్ ఎస్సై మహేష్, కోటగిరి ఎస్సై సునీల్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇలియాస్​, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా, మైనార్టీ మత పెద్దలు ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

tyui

ఇది కూడా చదవండి: Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *