అక్షరటుడే, డిచ్పల్లి: Bhupathi Reddy Comments | ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) (Thatha Madhu)అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Bhupathi Reddy Comments | నీచమైన వ్యాఖ్యలు
భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నీచమైన రాజకీయంగా తాత మధు వ్యాఖ్యలను అభివర్ణించారు. గౌరవప్రదమైన ఓ స్పీకర్ను అవమానించే విధంగా సభ వెలుపల వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా తాత మధు సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు సభ వెలుపల చేస్తున్న చేష్టలను తప్పుబట్టారు. తమ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య హక్కుగా ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని, ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు రాకపోవడం సిగ్గుచేటన్నారు.
ఇది కూడా చదవండి: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 సీజన్ మొదలైంది.