అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bike Theft | వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు(Nizamabad Police) ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి వివరాలు వెల్లడించారు.
Bike Theft | తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా..
ఎస్హెచ్వో తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలో ప్రధాన ప్రాంతాల్లో ఇటీవల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా తాను బాన్సువాడ(banswada) నుంచి వస్తున్నానని తెలిపాడు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాలని అడగగా తన వద్ద లేవని.. బైక్ను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని మరింత లోతుగా విచారించగా(Police Investigation) జనవరి నుంచి ఐదు బైక్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడు ఇచ్చిన సమాచారం మేరకు బైక్లను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు.


