BJP Protest | కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత.. మంత్రి పొంగులేటి రాజీనామాకు బీజేపీ డిమాండ్​

22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BJP Protest | రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ (BJP Nizamabad) జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. కలెక్టరేట్​లో (Collectorate) సమీక్షలో పాల్గొన్న మంత్రిని ఘెరావ్​ చేశారు.

BJP Protest | హాల్​లోని దూసుకెళ్లేందుకు యత్నం..

ఈ సందర్భంగా దినేష్​ కులాచారి మాట్లాడుతూ.. 22ఏ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. రాత్రికి రాత్రే సక్రమమైన అనుమతులున్న భూములు 22ఏలోకి వెళ్లడంతో సాధారణ ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకునే వెసులుబాటు కోల్పోయారన్నారు. దీనికి మంత్రి పొంగులేటి బాధ్యత వహించాలన్నారు. అప్పటి వరకు ఆయనను కలెక్టరేట్​ దాటనివ్వబోమని భీష్మించారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలిసి కలెక్టరేట్​లోని సమావేశంలో హాల్​లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: Indian Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *