అక్షరటుడే, ఇందూరు: Crop Bonus | వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) డిమాండ్ చేశారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
Crop Bonus | సాధారణం కంటే తక్కువ వర్షపాతం
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచిస్తుంది కానీ.. రాష్ట్రంలో వరి పంటకు బోనస్ ప్రకటించడంతో రైతులు వరిపైనే ముగ్గు చూపుతున్నారన్నారు. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని సూచించారు.
ప్రధానంగా రైతులు సజ్జలు, కందులు, కొర్రలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వాటిపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్లో నీళ్లు సరిపడా లేని విషయం తెలిసిందేనన్నారు. కాళేశ్వరం నుంచి హల్దీ వాగుకు నీటిని లిఫ్ట్ చేసి నిజాంసాగర్ను నింపాలన్నారు.