అక్షరటుడే, ఇందూరు: Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా మొక్క నాటి నీళ్లు పోశారు.

Environmental Protection | భవిష్యత్తు తరాల కోసం..
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. కాలుష్యాన్ని పెంచే పనులు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలనుకుంటే తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీజీహెచ్(Nizamabad GGH) ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
