అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro Rush | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. వాన దంచికొట్టడంతో రోడ్లు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు మెట్రోను ఆశ్రయించారు. దీంతో మంగళవారం సాయంత్రం మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. స్టేషన్లలో ప్రయాణికులు బారులు తీరారు. తిరుపతి క్యూలైన్ల మాదిరిగా ప్రజలు స్టేషన్లలో లైన్లో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hyderabad Metro Rush | ఇళ్లకు వెళ్లే సమయంలో..

విధులు ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపాడు. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్పేట్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో 15 నిమిషాల ప్రయాణానికి 3 నుండి 4 గంటల సమయం పట్టింది. దీంతో బైక్లు, కార్లు ఉన్నవారు సైతం వాటిని ఆఫీస్ పార్కింగ్ల్లోనే వదిలేసి మెట్రో స్టేషన్ల (Metro stations)కు పరుగులు తీశారు. దీంతో మెట్రో స్టేషన్లో జనజాతరను తలపించాయి.
Unnade 3 bhogi aa metro ki pic.twitter.com/k8XQclGNm1
— Is It True Bhavani (@isittruebhavani) June 10, 2026
ఇది కూడా చదవండి..: Wife Shot Dead | భార్యను గన్తో కాల్చి చంపిన భర్త
