India vs Sri Lanka | విజృంభించిన భారత బౌలర్లు.. కష్టాల్లో శ్రీలంక

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత బౌలర్లు విజృంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs Sri Lanka | శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత బౌలర్లు విజృంభించారు. తొలుత బ్యాట్​తో చెలరేగిన టీమిండియా(Team India).. తర్వాత బాల్​తో రెచ్చిపోవడంతో లంచ్​ బ్రేక్​ సమయానికి లంక జట్టు 5 వికెట్లు కోల్పోయింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్​ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మూడో రోజు భారత ఆటగాళ్లు రెండు పరుగులు మాత్రమే చేశారు. భారత్​ 462 పరుగులు చేసింది. అనంతరం ఆలౌట్​ కావడంతో లంక బ్యాటింగ్​కు వచ్చింది. ఆదినుంచి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో 100 పరుగులు కాకముందే ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయింది.

India vs Sri Lanka | తొలి ఓవర్​లోనే..

శ్రీలంక తొలి ఓవర్​లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్​ నిషాన్​ ఫెర్నాండో(0)ను మహమ్మద్​ సిరాట్​ ఔట్​ చేశాడు. లహిర ఉదర 27 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడిని మానవ్ సుతార్​ పెవిలియన్​కు పంపించాడు. లంచ్​ బ్రేక్​ సమయానికి లంక 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో సోనాల్‌ దినూషా, నిరోషన్‌ ఉన్నారు. సిరాజ్, కులదీప్‌, మానవ్‌సుతార్‌, రవీంద్ర జడేజా వికెట్లు తీశారు.

ఇది కూడా చదవండి..: India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *