అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Housing | హైదరాబాద్ నగరం (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti)కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, తదితర అంశాలపై గురువారం సమీక్షించారు.
క్యూర్ పరిధిలో నియోజకవర్గాన్నియూనిట్గా తీసుకొని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. ఇప్పటికే 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. మిగతా స్థలాలను ఈ నెల 28లోగా ఖరారు చేయాలని ఆదేశించారు.
Indiramma Housing | కార్యాలయాలకు భవనాలు

క్యూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్న ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళా లబ్దిదారుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ (Housing Corporation) ఆధ్వర్యంలో ఒకే మోడల్లో ఆర్డీవో (RDO), తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Comments | ఉద్యోగులు గంట అదనంగా పని చేయాలి : సీఎం రేవంత్రెడ్డి