అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Jagtial Kendriya Vidyalaya | జగిత్యాల (Jagtial)లో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Jagtial Kendriya Vidyalaya | పదెకరాలు కేటాయిస్తే బాగుండేది..
విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఎంపీ తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘం (KVS) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే కాగా, మెట్రో నగరాల వెలుపల ఉన్న కేంద్రీయ విద్యాలయాలకు 10 ఎకరాలు అనువైన ప్రమాణమని ఆయన పేర్కొన్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Heavy Rain | కామారెడ్డిలో కుండపోత.. రోడ్లపైకి చేరిన నీరు..