అక్షరటుడే, ఇందూరు: Dubba High School | నగరంలోని దుబ్బ హైస్కూల్లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ప్రశ్నించారు. వారు పాఠశాలను శుక్రవారం సందర్శించారు.
Dubba High School | మైదానంలో నిలబడే జాగా లేదు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బా ప్రభుత్వ పాఠశాల (Dubba Government School)లో వర్షం పడితే గ్రౌండ్లో కనీసం నిలబడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో 450 మంది పిల్లలు ఉన్నారని.. అయితే బాత్రూంలు మాత్రం రెండే ఉన్నాయన్నారు. ఆడపిల్లలు వాష్రూంకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలురు తప్పనిపరిస్థితుల్లో స్కూల్ బయటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో చుట్టపక్కల వాళ్లు విద్యార్థులను దూషిస్తున్నారని ఆమె వాపోయారు.
అలాగే తరగతి గదుల్లో టైల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని.. ఇవి తగిలి విద్యార్థులు గాయాలపాలవుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు చిరిగిపోయాయని.. అలాగే తరగతి గదుల్లో బెంచీలు కూడా సరిగ్గా లేవన్నారు. విద్యార్థులకు నాసిరకమైన దుస్తులు పంపిణీ చేయడంతో వారు వేసుకున్న కొన్నిరోజులకే చిరిగిపోయాయని వారు తెలిపారు. విద్యార్థులకు నీటి సౌకర్యం కూడా లేదని.. దీంతో భోజన సమయంలో అవస్థలు పడుతున్నారన్నారు. బాలికలు వాష్రూంలు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
ఇది కూడా చదవండి..: Jagtial Kendriya Vidyalaya | జగిత్యాలలో కేంద్ర విద్యాలయానికి పదెకరాల స్థలం కేటాయించాలి..: ఎంపీ అర్వింద్