అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్రెడ్డి నేడు వాటి గురించి అడిగితే తిడుతున్నాడని బీఆర్ఎస్ (BRS Telangana) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని (Armoor) సిద్దుల గుట్టపైన పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
Jeevan Reddy Comments | చేసిందేమీ లేదు
శివుడికి ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలను బొంద పెట్టిందని మండిపడ్డారు. చీటింగ్, లూటింగ్లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఖజానాకు కన్నం వేయడం, పాతగోడలకు సున్నం వేయడం తప్ప ఈ వెయ్యి రోజుల పాలనలో చేసిందేమి లేదన్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రూ.వేలకోట్ల బాకీ పడిందని ఆరోపించారు. హామీల అమలు జరిగేంతవరకు బీఆర్ఎస్ పోరు ఆగదన్నారు. తెలంగాణ ఆత్మ కేసీఆర్కు, ప్రేతాత్మ రేవంత్ రెడ్డికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: డ్యాన్స్తో అదరగొట్టిన మీర్జాపూర్ టీం