Kamareddy Cash Theft | కామారెడ్డిలో ఘరానా మోసం.. డబ్బులు లెక్కపెట్టిస్తామని నగదు తస్కరణ

డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు మోసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Cash Theft | డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ  దుండగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన పట్టణంలోని (Kamareddy) విద్యానగర్ సాయిబాబా ఆలయ రహదారిలో ఉన్న ఇందిరానగర్ ఎస్​బీఐ బ్రాంచ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Kamareddy Cash Theft | తండ్రీకూతురు కలిసి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఎస్​బీఐ బ్యాంక్​కు(SBI bank) వచ్చిన  పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన చింతకింది పూజ తన తండ్రితో కలిసి ఎస్​బీఐ బ్రాంచ్​లో రూ.50 వేలు డ్రా  చేశారు. బయటకు వచ్చి కౌంటర్ వద్ద డబ్బులు లెక్కిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మేము లెక్కపెట్టి ఇస్తాము.. తప్పులు రాకుండా ఉంటాయని తండ్రీకూతురు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. మాటలతో వారిని మభ్యపెట్టి చాకచక్యంగా లెక్కించినట్లుగా నటించారు. ఆ క్రమంలో రూ.15 వేలు తమ వద్ద దాచుకుని మిగిలిన రూ.35 వేలు మాత్రమే వారి చేతికి ఇచ్చి అక్కడి నుంచి నిష్క్రమించారు. మళ్లీ లెక్కించి చూడగా నగదు తక్కువగా ఉండడంతో విషయం అర్థమైంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాక్టర్​ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *