అక్షరటుడే, వెబ్డెస్క్: KTR on Congress | కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2014, 2018లో ఒంటరిగా పోటీచేసి తాము గెలిచామన్నారు. 2023లోనూ ఒంటరిగా పోటీచేసి చిన్న తేడాతో ఓడిపోయామని తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో కేటీఆర్ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేసి, కేసీఆర్పై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను కేటీఆర్ ఆవిష్కరించారు.
KTR on Congress | మళ్లీ కేసీఆర్ వస్తారు
రాష్ట్రంలో 2028లో మళ్లీ కేసీఆరే (KCR) సీఎం అవుతారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణను మళ్లీ 25 ఏళ్లు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. గ్యారెంటీలతో గద్దెనెక్కి వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
KTR on Congress | విజయానికి ప్రతీక
జూన్ 2 తెలంగాణ ఆత్మగౌరవానికి, త్యాగానికి, చారిత్రక విజయానికి ప్రతీక అని కేటీఆర్ అన్నారు. అసమానతలు, అవమానాలు, అణచివేత నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు అని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాల ద్వారా రాష్ట్ర సాధనను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం చారిత్రక ఆరంభాన్ని సూచించే రోజు జూన్ 2 అని తెలిపారు.
ఇది కూడా చదవండి..:Telangana Financial Crisis | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు


