అక్షరటుడే వెబ్డెస్క్:MGBS Bus Fire|హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో మంగళవారం (మే 26) ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ ప్లాట్ఫారమ్పై ఆపి ఉంచిన ఒక ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
MGBS Bus Fire| తృటిలో తప్పిన పెను ప్రమాదం..
గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీస్ ముగించుకుని ఎంజీబీఎస్ బస్టాండ్ లోని ప్లాట్ఫారమ్ వద్ద పార్క్ చేసి ఉంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ ప్రయాణికులు ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని అక్కడి వారు పేర్కొంటున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు ఆర్టీసీ అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
MGBS Bus Fire| ప్రమాదానికి గల కారణాలపై ఆరా..
బస్సులో మంటలు రావడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. బస్సు రక్షణా చర్యల (మెయింటెనెన్స్) లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక సమస్యల వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందా? అనే కోణంలో రవాణా శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
MGBS Bus Fire| అధికారుల హెచ్చరిక..
ప్రస్తుతం ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నందున వాహనదారులు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధిక వేడి కారణంగా వాహనాలు త్వరగా వేడెక్కి మంటలు అంటుకునే ప్రమాదం ఉందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఎంజీబీఎస్లో గద్వాల డిపో ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం
ఒక్కసారిగా బస్సు నుండి మంటలు చెలరేగడంతో, భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు pic.twitter.com/t90oQA9rCW
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026
ఇది కూడా చదవండి: Ramchander Rao Criticism| బీజేపీలో చేరిన మైనారిటీ నేతలు.. సాదరంగా ఆహ్వానించిన రామచందర్ రావు


